
అల్లు అర్జున్, మంచు మనోజ్, అనూష్క ప్రధాన పాత్రల్లో క్రిష్ (గమ్యం ఫేమ్) రూపొందిస్తున్న 'వేదం' చిత్రం మే నెల ఇరవై తేదిన రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో
అల్లు అర్జున్ స్లమ్ కుర్రాడుగా మాస్ క్యారెక్టరైజేషన్ తో సాగే పాత్రను చేస్తున్నారు. అనూష్క..వేశ్యగానూ, మంచు మనోజ్ రాక్ స్టార్ గానూ అలరించనున్నారు. మల్టిఫుల్ నేరేషన్ తో ఏ పాత్రకా పాత్ర మిగతా పాత్రలతో సంబంధం లేకుండా కథనంతో ఈ చిత్ర కథ సాగుతుంది. ఇక ఈ చిత్రంలో మరికొంత మంది హీరోలను గెస్ట్ స్టార్స్ గా చేయటానికి ఒప్పిస్తున్నారు. 'బిందాస్' తో ఓకే అనిపించుకున్న మంచు మనోజ్, ఇప్పటికే స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్, '
అరుంధతి ' చిత్రంలో ఎదిగిన అనూష్క కలిపి చేస్తున్న చిత్రం కావటంతో మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు
0 comments:
Post a Comment